Thursday, October 31, 2013

నయనతారకు అంతుపట్టని చర్మ వ్యాధి

 
టాలీవుడ్ సెక్సీ తార నయనతార అంతుపట్టని చర్మ వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి వల్ల ఒళ్ళంతా బొబ్బలు రావడంతో చాలా ఇబ్బందులు పడుతుందట నయన. దీంతో దీంతో మేకప్ వెయ్యడానికి చాలా ఇబ్బంది అవుతుండటంతో, ఇంగ్లీష్ మందులతోపాటు కేరళ వైద్యాన్ని కూడా వాడుతుంది  ఈమె. 
అయితే ఎన్ని మందులు వాడుతున్నా నాన్ వెజ్ తిన్నప్పుడల్లా మాత్రం ఈ వ్యాధి తిరగబెడుతుంది.  దీని వల్ల కొన్ని సినిమా షెడ్యూల్స్ క్యాన్సిల్ అవుతుండటంతో నయన బెంగ పెట్టుకుంది. ఇంతకు ముందు సమంతా కూడా ఇటువంటి వ్యాధితో బాధపడటం విశేషం.  

Monday, October 28, 2013

పవన్ కళ్యాన్ వద్దంటే హిట్ కొట్టిన మహేష్ బాబు


పంచ్ డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మొదట పవన్ కళ్యాన్ ని సంప్రదించడం జరిగిందట. కానీ పవన్ తిరస్కరించడంతో మహేష్ బాబు నటించాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే రేటింగ్ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. 

అతడు సినిమా ఒక్కటే కాకుండా పూరీ జగన్నాధ్ 'ఇడియట్' సినిమా స్టోరీ కూడా పవన్ కి చెప్పడం జరిగిందట. ఈ సినిమాని కూడా పవన్ తిరస్కరించడంతో రవితేజ తో హిట్ కొట్టాడు పూరీ. ఇలా పవన్ రెండు హిట్ సినిమాలను వేరే హీరోలకు వదులుకోవడం జరిగింది.  

Monday, October 21, 2013

దిల్ రాజు బౌన్సర్లు...


టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు పరిస్థితి త్వరలో తారుమారుకానుందా... ! ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు గురుంచే అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకు ముందు దిల్ రాజు బ్యానర్ కి టెక్నీషియన్, కార్మికులలో పేమెంట్ ప్రాంప్ట్ గా ఉంటుందనే గుడ్ విల్ వుండేది. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.  

'రామయ్యా వస్తావయ్యా' సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు, కార్మికులకిచ్చిన చెక్కులు బౌన్స్ అవుతుండటంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందట. ప్రస్తుతం చెక్ లు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ని కూడా మూసేసారనే టాక్ వినపడుతుంది. 

Friday, October 18, 2013

పవన్ డైలాగ్ పై నాగార్జున సెటైర్



నేను ట్రెండు ను ఫాలో అవను... సెట్ చేస్తా అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగుకి ఈలలు చప్పట్లూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా వచ్చిన నాగార్జున 'భాయ్' సినిమా ట్రైలర్ లో " ఇక్కడ ఎవడుపడితే వాడు వచ్చి ట్రెండును సెట్ చేసామనే బ్రమలో వున్నారు. అసలు ట్రెండును క్రియేట్ చేసింది నువ్వే కదా భాయ్" అనే డైలాగు వుంది. 

ఇది పవన్ కళ్యాన్ డైలాగుకి కౌంటర్ గా వేసిన సెటైరే అని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ ఇది పవన్ డైలాగుకి సెటైర్ కాదు. ఏదో డైలాగు బాగుంది కదా అని సినిమాలో పెట్టడం జరిగింది అని వివరించారు. ఏది ఏమైనా భాయ్ డైలాగు మాత్రం ఫిలింనగర్లో ఆసక్తికరమైన చర్చను జరుపుతుంది. 

Wednesday, October 16, 2013

మేనేజర్ ని తొలగించిన జూనియర్ ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో పూరీ జగన్నాథ్ దగ్గర పనిచేసి అవకతవకలకు పాల్పడి గెంటివేయబడిన కృష్ణ అనే అతన్ని తన మేనేజర్ గా నియమించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ సదరు కృష్ణను తన మేనేజర్ గా నియమించుకున్నాడని తెలిసినప్పుడు ఫిలిం నగర్ లో చాలా మంది ఆశ్చర్యంగా చూసారు. అయితే వారెవరి విమర్శలనూ అప్పుడు పట్టించుకోని జూనియర్ ఇప్పుడు సడన్ గా అతన్ని తొలగించాడు. దీనికి కారణం 'రామయ్యా వస్తావయ్యా'  సినిమా రిజల్ట్ అయ్యుండొచ్చని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతుంది.