Friday, December 13, 2013

సెక్స్ రాకెట్ లో శ్వేతా బసు!


సినీ ఇండస్ట్రీకి వ్యభిచారానికీ మధ్య వున్న గీత చాలా చిన్నదని చెప్పడానికి అప్పుడప్పుడూ రుజువులు దొరుకుతుంటాయి. ఈ మధ్యనే ఒక ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో ప్రస్తుతం సినిమాలు లేని వర్ధమాన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తుందని మధ్యవర్తులు చెబుతున్నారు.   ఈమె మూడు గంటలకు మూడు లక్షల రూపాయల వరకూ వసూలు చేస్తుందని సమాచారం. ఈ మూడు లక్షలలో ఒక లక్ష మాత్రం బ్రోకర్లు ఎగరేసుకుపోతున్నారట. ఇలా శ్వేతా బసు ని అరేంజ్ చేస్తామని బ్రోకర్లు గొప్పగా చెప్పుకోవడం టాలీవుడ్ లో సంచలనాన్ని కలిగిస్తుంది. ఈమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ రొంపిలో వున్నారని వారు బయటపెట్టారు. 

'రుద్రమదేవి' సినిమాలో రానా - ఫస్ట్ లుక్


గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా తెరకెక్కుతున్న రుద్రమదేవి సినిమాలో రానా ఫస్ట్ లుక్ అభిమానులను అలరించే విధంగా వుంది. ఈ సినిమాలో రానా నిడవర్ధ్యపురం (నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడిగా కనిపించనున్నాడు. రేపు (డిసెంబర్ 14) రానా పుట్టిన రోజు సంధర్భంగా ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యడం జరిగింది. 

Sunday, December 8, 2013

మంచు మనోజ్ కారుకి యాక్సిడెంట్


టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కారుకి యాక్సిడెంట్ అయింది. అవుటర్ రింగ్ రోడ్ లో మంచు మనోజ్ ప్రయాణిస్తున్న కారు అడ్డుగా వచ్చిన గేదెను తప్పించబోయి డివైడర్ ను డీ కొనడంతో కారు అదుపుతప్పి బోల్తా పడిందని సమాచారం. ఈ ప్రమాదంలో మనోజ్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

Saturday, December 7, 2013

అల్లు అర్జున్ 'రేసుగుర్రం' మూవీ ఫస్ట్ లుక్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న రేసుగుర్రం సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. సౌత్ బ్యూటీ శృతి హసన్ బన్నీ సరసన ఈ సినిమాలో నటిస్తుంది. లక్ష్మీ నరసింహ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీత అందిస్తున్నాడు. 

హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం హఠాన్మరణం


ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం (53) నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ లో మరణించారు. సంవత్సర కాలంగా లాంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు ఇద్దరు కుమారులు వున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వున్న ఫామ్ హౌజ్ లో సోమవారం ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

Wednesday, December 4, 2013

ప్రభాస్ అదుర్స్..


ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి' పై ఇప్పటికే అనేక అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులందరూ ఆసక్తిని పెంచుకుని ఎదురుచూస్తుండగా, దర్శకుడు రాజమౌళి ఎంత కట్టడి చేస్తున్నా ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ మాత్రం లీకవుతూనే వున్నాయి. అవి కావాలని లీక్ చేస్తున్నారా లేదా అనేది అప్రస్తుతమైనా పైన కనిపిస్తున్న స్టిల్  లో మాత్రం ప్రభాస్ లుక్ అదుర్స్ అనిపిస్తుంది కదా..   

Thursday, November 21, 2013

అత్తారింటికి దారేది సినిమాలో రాజమౌళి కారు


పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది సినిమాలో ఒక తెల్ల కారు హీరో వెనుకే వుండటం చాలామంది చూసే వుంటారు. చాలా సీన్లలో తరుచుగా కనిపించే ఈ కారు దర్శకుడు రాజమౌళిదట. కొంతమంది సినీ ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ నంబర్ (AP9 CM 1122) ను RTO వెబ్సైట్ లో పరిశీలించగా అది రాజమౌళి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తేలింది. ఇలా రాజమౌళి కారును అత్తారింటికి దారేది సినిమాలో వాడుకోవడం వెనుక నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కారణమై ఉండవచ్చని అనుకుంటున్నారు. 
ఛత్రపతి సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఈ ప్రసాద్ కి రాజమౌళితో మంచి అనుబంధం ఉండటంతో అయన కారును తమ సినిమాలో వాడుకోవడం జరిగిందని సమాచారం.     

Sunday, November 17, 2013

రాజమౌళి అలా కూడా చేస్తాడా?


టాలీవుడ్ అమరశిల్పి రాజమౌళి ఒక  సినిమా గనుక మొదలుపెడితే అది పూర్తయ్యే వరకూ వేరే విషయాన్ని పట్టించుకోడనే సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి రాజమౌళి పై టాలీవుడ్ లో ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బాహుబలి సినిమా పూర్తి కావడానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో, రాజమౌళి ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నాడట. అదేమిటంటే ఈ సమయంలో బాహుబలి తోపాటు ఒక చిన్న సినిమాను తెరకెక్కించబోతున్నారనేది ఈ రూమర్. అది కూడా మలయాళీ భామ నిత్యా మీనన్ తోనే తియ్యాలని డిసైడ్ అయ్యాడట రాజమౌళి. అయితే ఈ స్టార్ దర్శకుడు నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా లేదా అనేది తెలియాల్సి వుంది. 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు బోనెక్కనున్న నటుడు


పోలీసులు ఎంతగా తనిఖీలు చేస్తున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వీరికి చిక్కే ప్రముఖుల జాబితా మాత్రం రోజు రోజుకూ పెరుగుతుంది. ఇంతకు ముందు హీరో నిఖిల్, నవదీప్ ల లాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీడియాకు చిక్కాడు నటుడు రాజా రవీంద్ర. బంజారా హిల్స్ లో మొన్న రాత్రి 11. 30 సమయంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు AP 20 ap 1111 స్కోడా కారులో వస్తున్న రాజా రవీంద్రను పరీక్ష చెయ్యగా, మోతాదుకు మించి ఆల్కాహాల్ తీసుకున్నట్లు రుజువు కావడంతో కేసు నమోదు చేశారు. ఈయన్ని మంగళవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు సిటీ పోలీసులు.  

Sunday, November 3, 2013

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన యాంకరమ్మ

 ఈ మధ్యన హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే కోర్టులు కూడా జైలు శిక్షలు విధిస్తుండటంతో వీలైనంతవరకూ వీరికి దొరకకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు మద్యప్రియులు. ఇక సెలబ్రిటీల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. పోలీసు బీట్ లు ఉండని రహదారులను ఎన్నుకుని మరీ తమ సరదాలను తీర్చుకుంటున్నారు. ఇలాగే ఒక టాలీవుడ్ యాంకరమ్మ చిత్తుగా మద్యం తాగి స్నేహితులతో కలిసి కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడింది.  ఈ పొడుగు యాంకరమ్మను గుర్తించిన పోలీసులు మీడియాకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా, వద్దంటూ వారిని బ్రతిమాలి ఫైన్ చెల్లించి అక్కడినుంచి జారుకుందట. ఈ విధంగా జానపద పాటలను అవలీలగా పాడగల ఈ యాంకర్ కెమేరాల కంటపడకుండా తప్పించుకోగలిగింది.  

Thursday, October 31, 2013

నయనతారకు అంతుపట్టని చర్మ వ్యాధి

 
టాలీవుడ్ సెక్సీ తార నయనతార అంతుపట్టని చర్మ వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి వల్ల ఒళ్ళంతా బొబ్బలు రావడంతో చాలా ఇబ్బందులు పడుతుందట నయన. దీంతో దీంతో మేకప్ వెయ్యడానికి చాలా ఇబ్బంది అవుతుండటంతో, ఇంగ్లీష్ మందులతోపాటు కేరళ వైద్యాన్ని కూడా వాడుతుంది  ఈమె. 
అయితే ఎన్ని మందులు వాడుతున్నా నాన్ వెజ్ తిన్నప్పుడల్లా మాత్రం ఈ వ్యాధి తిరగబెడుతుంది.  దీని వల్ల కొన్ని సినిమా షెడ్యూల్స్ క్యాన్సిల్ అవుతుండటంతో నయన బెంగ పెట్టుకుంది. ఇంతకు ముందు సమంతా కూడా ఇటువంటి వ్యాధితో బాధపడటం విశేషం.  

Monday, October 28, 2013

పవన్ కళ్యాన్ వద్దంటే హిట్ కొట్టిన మహేష్ బాబు


పంచ్ డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మొదట పవన్ కళ్యాన్ ని సంప్రదించడం జరిగిందట. కానీ పవన్ తిరస్కరించడంతో మహేష్ బాబు నటించాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే రేటింగ్ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. 

అతడు సినిమా ఒక్కటే కాకుండా పూరీ జగన్నాధ్ 'ఇడియట్' సినిమా స్టోరీ కూడా పవన్ కి చెప్పడం జరిగిందట. ఈ సినిమాని కూడా పవన్ తిరస్కరించడంతో రవితేజ తో హిట్ కొట్టాడు పూరీ. ఇలా పవన్ రెండు హిట్ సినిమాలను వేరే హీరోలకు వదులుకోవడం జరిగింది.  

Monday, October 21, 2013

దిల్ రాజు బౌన్సర్లు...


టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు పరిస్థితి త్వరలో తారుమారుకానుందా... ! ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు గురుంచే అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకు ముందు దిల్ రాజు బ్యానర్ కి టెక్నీషియన్, కార్మికులలో పేమెంట్ ప్రాంప్ట్ గా ఉంటుందనే గుడ్ విల్ వుండేది. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.  

'రామయ్యా వస్తావయ్యా' సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు, కార్మికులకిచ్చిన చెక్కులు బౌన్స్ అవుతుండటంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందట. ప్రస్తుతం చెక్ లు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ని కూడా మూసేసారనే టాక్ వినపడుతుంది. 

Friday, October 18, 2013

పవన్ డైలాగ్ పై నాగార్జున సెటైర్



నేను ట్రెండు ను ఫాలో అవను... సెట్ చేస్తా అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగుకి ఈలలు చప్పట్లూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా వచ్చిన నాగార్జున 'భాయ్' సినిమా ట్రైలర్ లో " ఇక్కడ ఎవడుపడితే వాడు వచ్చి ట్రెండును సెట్ చేసామనే బ్రమలో వున్నారు. అసలు ట్రెండును క్రియేట్ చేసింది నువ్వే కదా భాయ్" అనే డైలాగు వుంది. 

ఇది పవన్ కళ్యాన్ డైలాగుకి కౌంటర్ గా వేసిన సెటైరే అని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ ఇది పవన్ డైలాగుకి సెటైర్ కాదు. ఏదో డైలాగు బాగుంది కదా అని సినిమాలో పెట్టడం జరిగింది అని వివరించారు. ఏది ఏమైనా భాయ్ డైలాగు మాత్రం ఫిలింనగర్లో ఆసక్తికరమైన చర్చను జరుపుతుంది. 

Wednesday, October 16, 2013

మేనేజర్ ని తొలగించిన జూనియర్ ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో పూరీ జగన్నాథ్ దగ్గర పనిచేసి అవకతవకలకు పాల్పడి గెంటివేయబడిన కృష్ణ అనే అతన్ని తన మేనేజర్ గా నియమించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ సదరు కృష్ణను తన మేనేజర్ గా నియమించుకున్నాడని తెలిసినప్పుడు ఫిలిం నగర్ లో చాలా మంది ఆశ్చర్యంగా చూసారు. అయితే వారెవరి విమర్శలనూ అప్పుడు పట్టించుకోని జూనియర్ ఇప్పుడు సడన్ గా అతన్ని తొలగించాడు. దీనికి కారణం 'రామయ్యా వస్తావయ్యా'  సినిమా రిజల్ట్ అయ్యుండొచ్చని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతుంది.   

Tuesday, September 17, 2013

మిస్ అమెరికా నీనా దవులూరి హాట్ ఫొటోస్


మిస్ అమెరికాగా ఎన్నికైన సంచలం సృష్టించిన తెలుగు తేజం నీనా దవులూరి స్వస్థలం విజయవాడ. మిస్ అమెరికాగా ఈ ఘనత సాధించిన తొలి ప్రవాస భారతీయురాలు నీనా కావడం విశేషం. పదిహేను మంది సెమీ ఫైనలిస్టుల మధ్య జరిగిన ఈ పోటీలో చివరకు నీనా ను మిస్ అమెరికా కిరీటం వరించింది. 


               మిస్ అమెరికా నీనా దవులూరి హాట్ ఫొటోస్ లింక్ 

Thursday, August 29, 2013

హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న సుమంత్?


'ప్రేమ కధ' సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేసిన సుమంత్ ఆ తరువాత సత్యం సినిమాతో హిట్ కొట్టినా... హీరో రేసులో మాత్రం వెనుకపడిపోయాడు. ఈ హీరో 'తొలిప్రేమ' సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ తరువాత వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. 
ఇప్పుడీ హీరో ఒక హీరోయిన్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడట! ఆ హీరోయిన్ మరెవరో కాదు. గోదావరి సినిమాలో తనకు జోడీగా నటించిన కమలినీ ముఖర్జీ ప్రేమలో మునిగితేలుతున్నాడట సుమంత్. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది . ఈ వార్తలో నిజమెంతో త్వరలో తెలియనుంది. 

Thursday, August 22, 2013

కుర్ర దర్శకుడి వెంటపడుతున్న ఫ్లాప్ హీరోలు



సినిమా వారసత్వంతో హీరోగా తెరంగ్రేటం చేసినా ఇండస్ట్రీలో హిట్ అనేది దక్కకపోతే వారికి వాల్యూ అనేదే వుండదు. అలాంటి వారి చూపు వరుస సక్సెస్ లు కొడుతున్న దర్శకులపై పడటం అనేది సహజమే. ప్రస్తుతం ఇండస్ట్రీలో లో బడ్జెట్ తో విజయవంతమైన సినిమాలు తీస్తున్న మారుతి వైపు పరిగెడుతున్నారు వీరందరూ. ప్రిన్స్ మహేష్ బావ అయిన సుధీర్ కు డీసెంట్ హిట్ ఇవ్వడంలో దర్శకుడు మారుతి పాత్ర ఎంతో వుంది. 
'గౌరవం' అనే ఫ్లాప్ సినిమాతో కెరీర్ ని మొదలు పెట్టిన అల్లు అరవింద్ తనయుడు శిరీష్ తోపాటు సుశాంత్ కూడా ఇలా వెంటపడిన లిస్టులో వున్నారు. ప్రస్తుతం శిరీష్-మారుతి కాంబినేషన్ లో 'కొత్త జంట' అనే సినిమా తెరకెక్కుతుంది. సుశాంత్ కూడా తన తల్లి నాగ సుశీల చేత మారుతి దగ్గర ప్రామిస్ తీసుకోవడం జరిగిపోయిందట. ఇలా బూతు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి వెంట పడుతున్నారు ఫ్లాప్ హీరోలు.     

Tuesday, August 20, 2013

మహేష్ బాబుతో 'అల్లరి' నరేష్ ఫ్రీ


టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు '1' సినిమా శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయి గా 15 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. అసలు విషయం ఏమిటంటే ఈ హక్కులు అమ్మే విషయంలో నిర్మాత అనిల్ సుంకర చిన్న బిజినెస్స్ టెక్నిక్ ను వాడటం జరిగింది. తాను ఎంతో ఇష్టపడి నరేష్ తో తీసిన  'యాక్షన్ 3D' సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఆ హక్కులను ఎవ్వరికీ అమ్మలేదు. కానీ ఆ సినిమా రిజల్ట్ చూసాక ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మహేష్ సినిమాతోపాటు ఫ్రీ గా ఇచ్చేసాడట నిర్మాత. ఇలా మహేష్ తోపాటు ఫ్రీగా అమ్ముడుపోయాడు అల్లరి నరేష్.  

Friday, August 2, 2013

హాట్ హాట్ ఫోజులిచ్చిన శ్రీదేవి


వెటరన్ తార శ్రీదేవి వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. యాభై సంవత్సరాలకు దగ్గరలో వున్న శ్రీదేవి, ఇప్పుడున్న హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ ఫోటో షూట్ చెయ్యడం విశేషం. వోగ్ మ్యాగజైన్ ఆగస్ట్ ఎడిషన్ లో ఆమె ఫోటోలు చూసిన వారికి ఎక్కడా వృద్దాప్య ఛాయలు కనపడకపోవడంతో ఇప్పటికీ ఆమె ఆ ఫిజిక్ ని ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. 
             


                  ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.  LINK 

Monday, March 18, 2013

గుత్తా జ్వాల హాట్ ఐటెం సాంగ్ ఫొటోస్

ప్రముఖ బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల కు వెండి తెరపై కూడా ఒక వెలుగు వెలగాలని ఎప్పటినుంచో కోరిక. తను ఊ అంటే అవకాశాలు వచ్చి పడతాయని ఆశించింది ఈమె. కానీ ఎందుకనో టాలీవుడ్ పెద్దగా పట్టించుకోకపోయినా నితిన్ సినిమా 'గుండె జారి గల్లంతయ్యిందే' లో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఈ ఫోటోలు కోసం క్రింద వున్న లింక్ ని క్లిక్ చెయ్యండి.   

                         గుత్తా జ్వాల ఫోటోలు 

Sunday, March 17, 2013

విడుదల కానున్న బ్రహ్మానందం సినిమా


కమెడియన్ బ్రహ్మానందం లీడ్ రోల్ లో నటించిన జఫ్ఫా సినిమా ట్రైలర్, పోస్టర్లు విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని బ్రహ్మానందం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరందరి కోరికా త్వరలోనే తీరే సూచనలు కనపడుతున్నాయి. ఎందుకో ఈ సినిమా క్రొత్త పోస్టర్లను చూస్తే మీకే అర్ధమవుతుంది. 


                                  జఫ్ఫా మూవీ న్యూ పోస్టర్స్ 

Tuesday, March 12, 2013

ఫ్లాప్ హీరోకి పారితోషికం ఎక్కువే?


చిన్న నిర్మాతల హీరోగా వున్న వరుణ్ సందేశ్, తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాగానీ రెమ్యునరేషన్ పరంగా బాగానే వెనుకేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ యువ హీరో ఒక్కో సినిమాకీ యాభై లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. వరుణ్ మొదటి సినిమా 'హ్యాపీ డేస్' మంచి హిట్ అవడంతో ఇతను ఓవర్ నైట్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఈ యాభై లక్షల రూపాయల మొత్తాన్ని రెండు విడతలలో చెల్లించేయాలంట. 40 రోజుల షెడ్యూల్ కి యాభై లక్షల రూపాయలు తీసుకుంటున్న వరుణ్ చేతిలో ప్రస్తుతం ఎనిమిది సినిమాల వరకూ వుండటం విశేషం.  

More News:

          సన్నీ లియోన్ న్యూ హాట్ ఫోటో షూట్ ఫొటోస్ 

Thursday, March 7, 2013

రాజశేఖర్ సినిమాలో పవన్ కళ్యాన్ పై సెటైర్లు?



'గబ్బర్ సింగ్' సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సీన్ లో రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ రోజ్ రోజ్ రోజా పువ్వా అంటూ ఒక రౌడీ చేసిన కామెడీ ఈ సీన్ కే హైలెట్. ఇలా రాజశేఖర్ ని ఇమిటేట్ చెయ్యడంపై జీవిత బహిరంగంగానే పవన్ కళ్యాణ్ పై మండి పడింది. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన 'మహంకాళి' సినిమా రేపు (శుక్రవారం) విడుదల కాబోతుంది. 
టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొన్ని సెటైర్లు వున్నాయట. అవి నిజంగా ఉన్నాయా లేకపోతే పవన్ అంటే గిట్టనివారు చేస్తున్న ప్రచారమా అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. 


More News:
                            అనుష్క లవర్ ఎవరంటే ?

Monday, March 4, 2013

సునీల్ వేలెట్టడమే కారణమా?


కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ తాజా చిత్రం 'మిస్టర్ పెళ్ళికొడుకు' రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ హిట్ మూవీ అయిన తను వెడ్స్ మను చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన 'మిస్టర్ పెళ్ళికొడుకు' యుధాతధంగా మాత్రం తెరకెక్కడం జరగలేదు. రీమేక్ సినిమాలు ఉన్నదున్నట్లుగా తెరకెక్కకపోయినా ఎవరి నేటివిటికీ తగ్గట్లుగా వారు మార్చుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో దర్శకుడిని ప్రక్కన పెట్టి మరీ సునీల్ సొంత దర్శకత్వం చెయ్యడంతో.. ఈ సినిమా ఇలా తయారయ్యిందన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో వినపడుతున్నాయి. ఇంతకుముందు కూడా పూలరంగడు సినిమాలో సునీల్ వేలుపెట్టి కెలికాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా హిట్ అవడంతో ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు 'మిస్టర్ పెళ్ళికొడుకు' సినిమా ఫ్లాప్ కావడంతో అందరూ సునీల్ ని వేలెత్తి చూపిస్తున్నారు. 

MORE NEWS: 

                           అనుష్క శర్మ హాట్ ఫొటోస్ 

Saturday, March 2, 2013

రామ్ చరణ్ తేజ సాహసం


'జంజీర్' చిత్రం రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న రామ్ చరణ్ తేజ రీసెంట్ గా చేసిన సాహసం బాలీవుడ్ జనాలను నివ్వెరపరిచింది. ఈ మధ్యనే రామ్ చరణ్, శ్రీహరి, సంజయ్ దత్ (హిందీ) ల మీద ఒక ఫైట్ సీన్ ని షూట్ చెయ్యడం జరిగింది. ఈ రిస్కీ ఫైట్ లో భాగంగా రామ్ చరణ్ మూడంతస్తుల ఎత్తునుంచి దూకాల్సి వుండగా, ఎటువంటి వైరుల సహాయం లేకుండానే దూకేయడం చూసి యూనిట్ సభ్యులతోపాటు దర్శకుడు అపూర్వ లఖియా కూడా నివ్వెరపొయారని సమాచారం.  

                 ఫోటో లింక్ 

Friday, March 1, 2013

వరుణ్ సందేశ్ క్రొత్త అఫైర్!


హీరో వరుణ్ సందేశ్ చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపించినా చేసే పనులు మాత్రం పెద్ద వాళ్ళని మించిపోతుంటాయి. ఈ మధ్య కాలంలో అఫైర్ల విషయంలో వరుణ్ సందేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటం విశేషం. హీరోయిన్ శ్రద్దా దాస్ తనకూ వరుణ్ కు మధ్య కొంత కాలం అఫైర్ నడిచిందని ఈ మధ్యన చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో 'క్లాస్ అబ్బాయి మాస్ అమ్మాయి' సినిమాలో తన సరసన నటిస్తున్న హరిప్రియతో ఘాటు అఫైర్ నడిపిస్తున్నాడని టాలీవుడ్ టాక్. ఈ అఫైర్ కారణంగా ఆమెను  తనకు తెలిసిన దర్శక, నిర్మాతలకు రికమెండ్ చేస్తున్నాడట. ఇలా వీరిద్దరి మొదటి సినిమా పూర్తి కాకుండానే 'ఈ వర్షం సాక్షిగా' అనే సినిమాలో తిరిగి నటించబోతున్నారు. హరిప్రియకు ఇప్పుడీ అవకాశం రావడం వెనుక వరుణ్ సందేశ్ కృషి వుందని టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు.

More News:

                    మహేష్ బాబు పై నమ్రత ప్రేమ 
                    హీరో డిమాండ్లకు కాళ్ళకు బుద్ది చెప్పిన నిర్మాత    

Wednesday, February 27, 2013

సునీల్ కాన్ఫిడెన్స్?


కమెడియన్ నుంచి హీరోగా ఆరంగ్రేటం చేసిన తరువాత సునీల్ సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న సంగతి తెలిసిందే. ఈ హీరో అప్ కమింగ్ మూవీ అయిన 'మిస్టర్ పెళ్ళికొడుకు' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సినిమా పబ్లిసిటీ పై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు సునీల్. దీనికి కారణం ఏమిటంటే... సునీల్ ఈ సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడట. సినిమాలో విషయం వుంటే అనవసరపు పబ్లిసిటీ అవసరం లేదన్నది సునీల్ ఆలోచనగా తెలుస్తుంది. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్ సరసన ఈ సినిమాలో ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది.  

More News: గ్రీకు వీరుడు మూవీ ట్రైలర్  

Tuesday, February 26, 2013

దర్శకురాలు నందిని రెడ్డి పై కేసు!?


సినీ ఇండస్ట్రీలో కాపీ కొట్టడం అనేది చాలా కామన్ అనే విషయం తెలిసిందే. హాలీవుడ్ సినిమాల నుంచి బాలీవుడ్ కాపీ కొట్టినా, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కాపీ కొట్టినా దానిని ముద్దుగా ఇన్స్పిరేషన్ అని చెప్పడం జరుగుతుంది. పెద్ద పెద్ద దర్శకులు, స్టార్లతో తీసేటప్పుడు మాత్రమే ఇటువంటి సినిమా రీమేక్ హక్కులు కొంటుంటారు. సిద్దార్ధ్, సమంతా జంటగా నటించిన 'జబర్ దస్త్' సినిమా బాలీవుడ్ హిట్ మూవీ 'బ్యాండ్ బాజా బరాత్' సినిమాకి ఫ్రీ మేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ వారు తెలుగులో నాని హీరోగా నిర్మిద్దామనే ప్రయత్నాల్లో వుండగా నందిని రెడ్డి తెరకెక్కించేసింది. దీంతో సదరు సంస్థ నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకురాలు నందిని రెడ్డి పైనా లీగల్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. జబర్ దస్త్ సినిమా బాలీవుడ్ సినిమాకి కాపీ అని ప్రేక్షకులందరూ అంటున్నా నందిని మాత్రం ఆ సినిమాకీ, మా సినిమాకీ చాలా తేడాలున్నాయని బుకాయించే ప్రయత్నం చేస్తుంది. 'అలా మొదలైంది' సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన నందిని రెండో సినిమాకే ఇలా కాపీ బాట పట్టడం విచారించదగ్గ విషయం. 

Saturday, February 23, 2013

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై వర్మ సెటైర్లు



సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఏమి చేసినా సంచలనంగానే వుండేది. వర్మకి ప్రస్తుతం అప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు లేకపోయినా ఎంతోకొంత మిగిలేఉన్నదన్న సంగతి తెలిసిందే. మొన్న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ళ తరువాత రాజకీయనాయకులు చేసిన ప్రకటనలపై వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేసాడు. 
ఈ బాంబు పేలుళ్ళ ఘటనను ఖండిస్తున్నా అని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనడంపై... ఈ అరిగిన డైలాగుని 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచీ వింటున్నా అని ట్వీటాడు. ప్రధాన మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చెయ్యడంపై... విచారం వ్యక్తం చెయ్యకుండా సంతోషం వ్యక్తం చేస్తారని మనం అనుకుంటామా? రాజకీయనాయకులకి కోన వెంకట్ లాంటి మంచి రైటర్స్ అవసరం ఎంతైనా వుంది అని వ్యాఖ్యానించడం జరిగింది. 
కేంద్ర హొమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ పేలుళ్లపై విచారణ జరిపిస్తామని అంటే ... ఈ డైలాగు ఈ దశాబ్దానికే హైలెట్ డైలాగని సెటైర్లు వేసాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తానికి వర్మ ఈ ఘటనను కూడా సంచలనం చెయ్యాలని చూడకుండా, సామాన్య ప్రజల ఆవేదనని తన ట్వీట్స్ ద్వారా కళ్ళకి కట్టినట్లు చూపెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం.  

More News:

నిమిషానికి అయిదు లక్షలు తీసుకున్న అంజలి 

Thursday, February 21, 2013

హైదరాబాద్ లో వరుస బాంబు పేలుళ్లు



హైదరాబాద్ పై తీవ్రవాదులు మరొకసారి తమ పంజా విసిరారు. దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో 18మంది వరకూ మరణించినట్లు సమాచారం. మరొక యాభై మంది వరకూ గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.  దిల్ సుఖ్ నగర్ లోని వెంకటాద్రి , కోణార్క్ ధియేటర్ల వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు జరిగిన వెంటనే భయంతో ప్రజలు పరుగులు తీయడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.  

Wednesday, February 20, 2013

స్పెయిన్లో బన్నీతో కలిసిన ఎన్టీఆర్

                

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతుంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ సినిమా 'ఇద్దరమ్మాయిలతొ' షూటింగ్ కూడా అక్కడే జరుపుకుంటుంది. ఈ  రెండు సినిమాలూ ఒకే ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుండటంతో బాద్ షా యూనిట్ సభ్యులయిన ఎన్టీఆర్, శ్రీనువైట్ల లు ఇద్దరమ్మాయిలతొ సినిమా యూనిట్ ని కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ రెండు సినిమాలకూ బండ్ల గణేష్ నిర్మాత కావడం విశేషం.                           

Tuesday, February 19, 2013

చెట్టు క్రింద ప్లీడర్ గా పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ త్వరలో లాయర్ గా కనిపించనున్నాడు! ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్స్ అయిన పవన్, వెంటనే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చెట్టు క్రింద లాయర్ గా వున్న పవన్...  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ప్రజల పక్షాన నిలిచి ఏ విధంగా  విజయం  సాధించాడనేదానిని దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో చూపెట్టనున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత క్రిష్, సంపత్ నంది ల దర్శకత్వంలో చెయ్యడానికి అంగీకరించాడు.
  
More News:
                     దయతలిచిన దర్శకుడు లారెన్స్!

'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' దాసరి నారాయణరావు



టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' అనే టైటిల్ తో ఈయన ఒక సినిమాని తెరకెక్కించనున్నారని సమాచారం. కొంతమంది కొత్త నటులతోపాటు పాత నటులు కూడా ఈ సినిమాలో నటించనున్నారట. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని టార్గెట్ చేస్తూ ఒక సినిమాను విడుదలచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' సినిమాలో దాసరి ఎవరిని టార్గెట్ చేస్తారు అనేదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

Monday, February 18, 2013

ఆ హీరోతో డేటింగ్ చేసానన్న శ్రద్దా దాస్!


హ్యాపీ డేస్ సినిమాతో వెండితెరకు పరిచయమయిన వరుణ్ సందేశ్ తెరమీద కనపడేటంత అమాయకుడేమీ కాదు. చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఇతని తెరవెనుక భాగోతాలు మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. ఇప్పుడు ఇతని గురుంచి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే...హీరోయిన్ శ్రద్దా దాస్ తెలుసు కదా! మరో చరిత్ర సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్యా హాట్ హాట్ అఫైర్ సాగిందట. దాదాపు రెండు సంవత్సరాలపాటు సీక్రెట్ గా సాగిన వీరి అఫైర్ తరువాత బ్రేక్ అయింది. ఈ విషయాన్ని శ్రద్దా దాస్ స్వయంగా వెల్లడించింది. కానీ ఇలా విడిపోవడానికి గల కారణమేమిటన్నదాని గురుంచి మాత్రం శ్రద్ధా నోరు విప్పడంలేదు.  

విక్రమ్, రానాల మాటల యుద్ధం



టాలీవుడ్ హీరో రానా, తమిళ హీరో విక్రమ్ మీద విరుచుకుపడ్డాడు. దీనికి కారణమేమిటంటారా...? 
విక్రమ్ ఒక ఇంటర్వ్యూలో రానా బాలీవుడ్ ఎంట్రీ పై కొన్ని వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది. బాలీవుడ్ లో సినిమాలు చెయ్యడమనేది కెరీర్ ను మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టడమే అవుతుంది. దీని వల్ల చాలా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుంది అంటూ ఉదాహరణగా రానా గురుంచి చెప్పాడు. రానాని తెలుగులో ఎవరూ పట్టించుకోకపోవడంతో బాలీవుడ్ లో సినిమాలు చేసాడు. అక్కడ కూడా చుక్కెదురవడంతో తిరిగి తెలుగులో చేస్తూ తడబడుతున్నాడు అని అన్నాడు.
దీనిపై రానా ఒక రేంజ్ లో విమర్శలు చెయ్యడం జరిగింది. వరుసగా పది ఫ్లాప్ సినిమాలకు దగ్గరలో వున్న నువ్వు నీ కెరీర్ పై దృష్టి పెట్టడం మంచిది. పాతికేళ్ళు కెరీర్ వున్న మీరు రెండున్నరేళ్ళ కెరీర్ తో సాగుతున్న నా గురుంచి ఆలోచించడం మాని మీ పని మీరు చూసుకోండని జవాబిచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ లోగానీ కోలీవుడ్ లోగానీ ఈ మాటల యుద్ధం పెద్ద చర్చాంశనీయమయింది.

Sunday, February 17, 2013

రాజమౌళి-ప్రభాస్ ల బాహుబలి మూవీ ఫస్ట్ లుక్


దర్శకధీర ఎస్ ఎస్ రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న బాహుబలి సినిమా ఫస్ట్ లుక్ మీకోసం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించనుంది. 

Saturday, February 16, 2013

భాజాపా లో చేరిన చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్

  
కేందమంత్రి, మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ భారతీయ జనతాపార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. చిరు చిన్న కూతురు శ్రీజ, భరద్వాజ్ లు ప్రేమించి సినిమా స్టైల్లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత వీరిద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో విడిగా వుంటున్నారు. అయితే ఈ భరద్వాజ్ మొదట వైఎస్సార్ కాంగ్రెస్స్ లో చేరబోతున్నాడనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ ఎందుకో ఇది కార్యరూపం దాల్చకుండా భాజాపా వైపు అడుగులు వేసాడు శిరీష్. బండారు దత్తాత్రేయ, ప్రభాకర్ లాంటి ప్రముఖుల సమక్షంలో ఈయన బీజేపీలో చేరడం జరిగింది.  

Friday, February 15, 2013

మహేష్ బాబు కూతురు సితార ఫోటో



టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల రెండో సంతానమయిన సితార ఫోటో మీకోసం. పై చిత్రంలో కొడుకు గౌతమ్ ని కూడా చూడవచ్చు.

హేమచంద్ర, శ్రావణ భార్గవి పెళ్లి ఫోటోలు




వర్ధమాన సింగర్లయిన హేమచంద్ర, శ్రావణ భార్గవిలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే ఈ జంట నిశ్చితార్ధం కూడా జరిగింది. ప్రేమికులరోజు అయిన ఫిబ్రవరి 14 న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ పెళ్లి ఫోటోలు మీకోసం.