Tuesday, August 5, 2014

అల్లు అరవింద్ ఫ్యామిలీలో బెల్లంకొండ హీరో చిచ్చు?


టాలీవుడ్ లో ఒక రేంజ్ నిర్మాతగా వెలుగొందుతున్న బెల్లంకొండ సురేష్ తన కొడుకు సినిమాకి కల్లుచెదిరే రీతిలో ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో టెక్నీషియన్ కి ఇచ్చే పారితోషికం కంటే ఎక్కువే ఇచ్చి పని చేయించుకున్నాడు. 
ఈ సినిమాకి ముప్పై కోట్ల రూపాయలు దాటే ఖర్చయ్యిందని వినికిడి. అయితే అల్లు అరవింద్ తనయుడు శిరీష్ మాత్రం ఈ విషయం మీద తన తండ్రిపై అసంతృప్తిగా ఉన్నాడట. ఒక టాలీవుడ్ టాప్ నిర్మాత అయి వుండి కూడా తనను 'గౌరవం' లాంటి లో బడ్జెట్ సినిమాతో లాంచ్ చెయ్యడం పై  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. 

No comments:

Post a Comment