దివంగత హీరో శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతో భాద పడుతున్నట్లు సమాచారం. భర్త శ్రీహరి మరణం తరువాత దిగులుతో ఉంటున్న ఈమె లివర్ వ్యాధితో భాధ పడుతున్నారట. ప్రస్తుతం ఈమె సింగపూర్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీహరి మరణం తరువాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారడంతో చెన్నై, హైదరాబాద్ లలోని హాస్పటల్స్ లో చూపించడం జరిగింది.
అయినా ఆమె కోలుకోకపోవడంతో సింగపూర్ లోని ఒక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈమె ఆలనా పాలనా సోదరి లలిత కుమారి చూసుకుంటున్నారు. శ్రీహరి, శాంతి దంపతులకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment