Saturday, February 23, 2013

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై వర్మ సెటైర్లు



సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఏమి చేసినా సంచలనంగానే వుండేది. వర్మకి ప్రస్తుతం అప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు లేకపోయినా ఎంతోకొంత మిగిలేఉన్నదన్న సంగతి తెలిసిందే. మొన్న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ళ తరువాత రాజకీయనాయకులు చేసిన ప్రకటనలపై వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేసాడు. 
ఈ బాంబు పేలుళ్ళ ఘటనను ఖండిస్తున్నా అని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనడంపై... ఈ అరిగిన డైలాగుని 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచీ వింటున్నా అని ట్వీటాడు. ప్రధాన మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చెయ్యడంపై... విచారం వ్యక్తం చెయ్యకుండా సంతోషం వ్యక్తం చేస్తారని మనం అనుకుంటామా? రాజకీయనాయకులకి కోన వెంకట్ లాంటి మంచి రైటర్స్ అవసరం ఎంతైనా వుంది అని వ్యాఖ్యానించడం జరిగింది. 
కేంద్ర హొమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ పేలుళ్లపై విచారణ జరిపిస్తామని అంటే ... ఈ డైలాగు ఈ దశాబ్దానికే హైలెట్ డైలాగని సెటైర్లు వేసాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తానికి వర్మ ఈ ఘటనను కూడా సంచలనం చెయ్యాలని చూడకుండా, సామాన్య ప్రజల ఆవేదనని తన ట్వీట్స్ ద్వారా కళ్ళకి కట్టినట్లు చూపెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం.  

More News:

నిమిషానికి అయిదు లక్షలు తీసుకున్న అంజలి 

No comments:

Post a Comment