Tuesday, February 19, 2013

'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' దాసరి నారాయణరావు



టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' అనే టైటిల్ తో ఈయన ఒక సినిమాని తెరకెక్కించనున్నారని సమాచారం. కొంతమంది కొత్త నటులతోపాటు పాత నటులు కూడా ఈ సినిమాలో నటించనున్నారట. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని టార్గెట్ చేస్తూ ఒక సినిమాను విడుదలచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' సినిమాలో దాసరి ఎవరిని టార్గెట్ చేస్తారు అనేదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

No comments:

Post a Comment